కేసీఆర్ వచ్చి కుర్చీ వేసుకుని కూర్చున్నా.. కాంగ్రెస్ గెలుపుని ఆపలేరు - ఉత్తమ్
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి. స్వయంగా కేసీఆర్ వచ్చి కుర్చీ వేసుకుని కూర్చున్నా.. హుజూర్ నగర్లో కాంగ్రెస్ గెలుపుని ఆపలేరన్నారు. కాంగ్రెస్ నేతలను కేసుల పేరుతో బెదిరించి.. టీఆర్ఎస్లో చేర్చుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద విస్ఫోటనం తప్పదని జోస్యం చెప్పారు ఉత్తమ్.
Also watch :