తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ఎల్పీ విలీనం, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కోర్టు పరిధిలో ఉందని, కాంగ్రెస్ ఎల్పీ విలీనం చెల్లదని గవర్నర్కు చెప్పామన్నారు భట్టి. పార్టీ మారిన సబితను మంత్రివర్గంలోకి తీసుకొని.. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు.