జమ్ముకశ్మీర్ విషయంలో రగిలిపోతున్న పాకిస్తాన్.. సరిహద్దుల్లో భారత ఆర్మీ పోస్టులు, గ్రామాలే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. పూంఛ్ జిల్లాలోని పలు గ్రామాల్లో మోర్టార్ షెల్స్ ను ప్రయోగించింది. వీటిలో కొన్ని పేలగా మరికొన్ని పేలలేదు. భయాందోళకు గురైన స్థానికులు సమాచారం ఇవ్వడంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది . 9 మోర్టార్ షెల్స్ను స్వాధీనం చేసుకుంది. అనంతరం మెంధార్ ప్రాంతంలో వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేసింది ఆర్మీ. మోర్టార్ షెల్స్ పేలడంతో ఆప్రాంతం అంతా ఒక్కసారిగా కంపించింది.