వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' సినిమాను 'గద్దలకొండ గణేష్' గా పేరు మార్చారు నిర్మాతలు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సినిమా విడుదలకు బ్రేక్ పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా శుక్రవారం విడుదల కానున్న వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాములు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు.