మన్యంలో మావోయిస్టు పోస్టర్లు.. నిలిచిపోయిన బస్సు సర్వీసులు

Update: 2019-09-21 02:10 GMT

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. సీపీఐ మావోయిస్టు పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాలను ఈ నెల 21 నుంచి ఘనంగా జరుపుకోవాలని చింతూరు, ఏడుగురాళ్లపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోస్టర్లు జారవిడిచారు. దీంతో ఆర్టీసీ అధికారులు మన్యానికి రాత్రి బస్సు సర్వీసులు నిలిపివేశారు. జగదల్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే TSRTC బస్సులు చట్టి వద్దనే ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు జాతీయ రహదారిపై రాత్రంతా చీకట్లో అవస్థలు పడ్డారు.

Also watch :

Full View

Similar News