ఇండియన్ ఎయిర్ఫోర్స్.. 87వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. నేషనల్ వారి మెమోరియల్ వద్ద అమరవీరులకు త్రివిధ దళాల అధిపతులు శ్రద్ధాంజలి ఘటించారు. వారి సేవల్ని స్మరించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ఫోర్స్కు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వాయిసేన అందించిన సేవలు మరువలేనివని అన్నారు.