ఆర్టీసీ కార్మిక సంఘాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అఖిలపక్షం నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని కేసీఆర్ ఎలా అంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచిస్తామని చాడ హెచ్చరించారు.