ఖమ్మంలో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. శ్రీనివాస్ రెడ్డి అనే కండక్టర్ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ఆయన శరీరం 90 శాతం కాలిపోయింది. సమ్మెపై ప్రభుత్వ వైఖరితో మనస్తాపం చెంది శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కార్మికులు ఆరోపిస్తున్నారు.