కర్నూలు జిల్లా నంద్యాల ఫరూక్ నగర్లో డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి ఇంట్లో చోరీ జరిగింది. 30 తులాల బంగారం, 3 కేజీల వెండి, రెండు లక్షల నగదు అపహరణ గురైంది. ఆధారాలు దొరకకుండా ఇంట్లో కారంపొడి చల్లి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.