భారతీయులు ఎక్కడున్నా అందులో కీలక పాత్ర ఉంటుంది : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Update: 2019-10-25 01:11 GMT

భారతీయులు ఎక్కడ ఉన్నా ఆ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారత్ లో జరుగుతున్న ఆర్ధిక, సామాజిక పురోగభివృద్ధికి ప్రవాసి భారత పౌరుల తోడ్పాటును ప్రశంసించారు. అలినోద్యమ దేశాల అధినేతల సమావేశానికి హజరయ్యేందుకు అజర్బైజన్ రాజధాని బాకు చేరుకున్న వెంకయ్యనాయుడు...అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. పుట్టిన దేశాన్ని, కన్నతల్లిదండ్రులను, మాతృభాషను మరవొద్దని పిలుపునిచ్చారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి ప్రసంగం తమకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చిందని అన్నారు బాకు లోని ప్రవాస భారతీయులు. భారత ఉపరాష్ట్రపతి బాకులో పర్యటించటం చరిత్రలో ఇదే తొలిసారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణ ఏర్పడటానికి ఆయన పర్యటన తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News