నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. కడెం ఎడమ కాలువలోకి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు గల్లంతైయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు మృతదేహాలను వెలికితీసారు. మృతి చెందిన ఇద్దరు మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి శశాంక్ సాయి, సంగీత్గా గుర్తించారు.