జమ్మూ
సోమవారం సోపోర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సామాన్య పౌరులు లక్ష్యంగా గ్రనేడ్ దాడి చేశారు. ఈ అటాక్లో 15 మంది పౌరులు గాయపడ్డారు. అందులో ఆరుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంతకుముందు ఆపిల్ వ్యాపారస్థులపైనా కాల్పులు జరిపారు. ఆపిల్ పండ్లు తరలిస్తున్న ట్రక్కులనూ టార్గెట్ చేశారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ బృందం కశ్మీర్ పర్యటనకు వచ్చిన సమయంలోనే టెర్రరిస్టులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడడం గమనార్హం.