TS : నేడు తెలంగాణకు ప్రధాని మోదీ

Update: 2024-04-30 04:47 GMT

నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా ఆందోలు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని మహారాష్ట్రలోని లాతూర్ నుంచి మధ్యాహ్నం 3:20కి బయలుదేరి సాయంత్రం 4:20 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు.

సభ తర్వాత 5:55 గంటలకు దుండిగల్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. వచ్చే నెల 8న ప్రధాని మోదీ తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు రానున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు. వేములవాడలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రసగిస్తారని చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెల 1, 5వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. మే 1న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News