బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్లో 0.13 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.37,964కు చేరింది. అలాగే వెండి ధర 0.36 శాతం పెరుగుదలతో కేజీకి రూ.46,155కు ఎగసింది. సెప్టెంబర్ నెల ఆరంభంలో 10 గ్రాములు ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. తాజాగా బంగారం ధర దాదాపు రూ.2,000 పడిపోయింది. వెండి ధర కూడా గత నెలలో ఏకంగా రూ.51,000 మార్క్ పైకి చేరిన విషయం తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 1,488 డాలర్ల సమీపంలో కదలాడుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఈ ఏడాది బంగారం ధర దాదాపు 16 శాతం మేర పరుగులు పెట్టింది.