వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక ప్రతిభ రెసిడెన్షియల్ స్కూల్ లో వార్డెన్ గా పనిచేస్తున్న దశరథ్ ఇద్దరు విద్యార్ధులపై అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. విద్యార్ధులను నిత్య గదిలోకి పలిచి వారి చేత అసభ్యంగా ప్రవర్తించేవాడని చిన్నారులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బంధవులు స్కూలుకు వచ్చి దశరథ్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.