ప్రధాని మోదీ థాయ్లాండ్ పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు థాయ్లాండ్లో పర్యటించనున్న మోదీ.. 14న తూర్పు ఆసియా సదస్సుతో పాటు ఆసియన్ - ఇండియా సదస్సులోనూ పాల్గొంటారు. గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తరువాత థాయ్లాండ్లో స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. థాయ్లాండ్ ప్రధాని ప్రయుత్ ఛాన్ ఆహ్వానం మేరకు మోదీ బ్యాంకాక్లో పర్యటిస్తారు. ఆదివారం మోదీ-ప్రయుత్ భేటీ కానున్నారు. వాణిజ్యం, తీర ప్రాంతాల భద్రత వంటి అంశాలపై ఇద్దరు చర్చిస్తారు.