రామకుప్పం మండలంలో బాబు సహా ఏడు కుటుంబాలకు చెందిన 7 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పట్టాలను వేరొకరికి ఇచ్చారు. ఆ స్థలం తమదేనంటూ బాబు 6 నెలలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా స్పందన లేకపోవడంతో తన కుటుంబంతో సహా వచ్చి తహశీల్దార్ ఆఫీసులో ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎమ్మార్వో ఆఫీసు గేట్లకు ఉరితాళ్లు బిగించి.. తమ భూమి తమకు ఇవ్వకపోతే ఇక్కడే చనిపోతామని హెచ్చరించారు.