మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆర్టీసీ కార్మికులు పిలుపు ఇచ్చిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇతర బీజేపీ నేతలతో కలిసి ఆయన ట్యాంక్బండ్వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదానికి దిగారు.. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో.. జితేందర్ రెడ్డితో పాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.