సిక్కుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. పంజాబ్లోని సుల్తాన్పూర్ లోధి వద్ద కర్తార్పూర్ కారిడార్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. డేరాబాబా నానక్ను సందర్శించి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ను ప్రారంభించారు మోదీ. కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం కోసం సహకరించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్కు కృతజ్ఞతలు తెలిపారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతికి ముందే ఈ కారిడార్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గురునానక్ దేవ్కి సంబంధించిన అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవల్ని ప్రారంభిస్తామని చెప్పారు.