పీఆర్సీ ప్రకటనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాల పెంపుకోసం 2018 మేలో పీఆర్సీ కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసింది. త్వరగా నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు పది , 12 రోజుల్లో పీఆర్సి నివేదిక ఇచ్చేందుకు కమిషన్ సిద్దమైంది. ఏడాదిన్నరగా వేతనాల పెంపుపై అధ్యయనం చేసింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం 2018 జులై 1 నుంచి కొత్త వేతనాలు అమలులోకి రావాల్సి ఉంది.