కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి ఎస్సై మురళి సస్పెండ్ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ రోజు ఆయన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. స్టేషన్ ఆవరణలోనే ఆయన మద్యం సేవించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎస్పీ శ్వేతా రెడ్డి చర్యలు తీసుకుంటూ.. ఎస్సై మరళిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.