హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎక్సెల్ సివిల్స్ అకాడమీని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఎక్సెల్ సివిల్స్ అకాడమీ సక్సెస్ అవాలని కోరుతూ ప్రతినిధులకు బెస్ట్ విషెస్ చెప్పారు. అఖిల భారత సర్వీసులకు వెళ్లాలనే విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమన్నారు భువనేశ్వరి. వీటి ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. సమాజానికి మంచి చేయాలన్న లక్ష్యం ఉన్నవారికి సివిల్ సర్వీసులు ఉపయోగపడతాయన్నారు.