సీనియర్ జర్నలిస్ట్ నీల్కాంత్ ఖాదీల్కర్ స్వల్ప అనారోగ్యంతో మరణించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరాఠీ వార్తాపత్రిక 'నవకల్' సంపాదకుడైన ఖాదీల్కర్ (85) సబర్బన్ బాంద్రాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
ఆయన 27 సంవత్సరాలు వార్తాపత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. "ప్రాక్టికల్ సోషలిజం’’, ‘‘రష్యా పర్యటన విశేషాలు" లాంటి పుస్తకాలను ఆయన రచించారు.