కొందరు వాహనదారులు నాసిరకం హెల్మెట్లు ధరించి ప్రమాదాల బారిన పడతున్నారని అన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. నాసి రకం హెల్మెట్లు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. నాసిరకం హెల్మెట్లు అమ్మినా.. తయారు చేసినా.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు సీపీ సజ్జనార్.