అయ్యప్ప దర్శనానికి సిద్ధమైన మహిళపై కారం పొడి, పెప్పర్ స్ప్రేతో దాడి

Update: 2019-11-26 04:11 GMT

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమైన మహిళపై దాడి జరిగింది. కేరళకు చెందిన బిందు అనే మహిళపై మంగళవారం ఓ వ్యక్తి కారం పొడి చల్లాడు. ఆ తర్వాత పెప్పర్ స్ప్రే ప్రయోగించాడు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందే ఈ ఘటన జరిగింది. తృప్తి దేశాయ్‌తో కలిసి సన్నిధానానికి వెళ్లితీరుతానని ప్రకటించిన నేపథ్యంలోనే కొందరు హిందుత్వ వాదులు ఆమె తీరుపై మండిపడ్డారు. చివరికి ఆమెపై కారం పొడి, పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు.

ఈ ఏడాది జనవరి 2న బిందు శబరిమలకు వెళ్లింది. ఈసారి కూడా అయ్యప్పను దర్శనం చేసుకుంటానని.. తమకు సెక్యూరిటీ కల్పించకపోయినా వెళ్లి తీరతానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఎటాక్ జరిగింది. ఇది పెను సంచలనంగా మారింది.

Similar News