Breaking News : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ .. ఏడుగురు మావోయిస్టులు మృతి

Update: 2024-04-30 09:45 GMT

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కాంకేర్, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా కూంబింగ్ జరిపాయి. ఈక్రమంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగు తోంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొందరు పారిపోయారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇటీవలే కాంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News