వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించింది. దీంతో రాంగోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమా చూసి సర్టిఫికెట్ ఇచ్చేలా సెన్సార్ బోర్డును ఆదేశించేలా చేయాలంటూ పిటిషన్ వేశారు. ప్రస్రుతం హైకోర్టులో దీనిపై విచారణ సాగుతోంది.