శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఆయనకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతి భవన్లో స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇటీవల చైనా అనుకూల ప్రభుత్వం శ్రీలంకలో ఏర్పాటు అయిన నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్సే పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.