మందేసి చిందేశాడు.. తరువాత సస్పెండ్..

Update: 2019-12-03 07:47 GMT

పోలీసు శాఖలో క్రమశిక్షణతో ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో రోడ్‌పై చిందులేశాడు. ఫలక్‌నామా పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈశ్వరయ్య పీకలదాకా తాగి రాత్రి రోడ్‌పై పడిపోయాడు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గింది. పక్కకు జరగాలని కోరిన వాహనదారులపైనా ఈశ్వరయ్య చిందులేశాడు. ఓ వాహనదారుడు తీసిన వీడియో వైరల్ కావడంతో నగర పోలీస్ కమిషనర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

Similar News