ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీలో ఎన్ఎస్జీ కమాండోలు హల్ చల్ చేశారు. చాకచక్యంగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆగండి.. ఇదేదో నిజం అనుకుంటే పొరపాటే.. ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా ఎన్ఎస్జీ కమాండోలు మాక్డ్రిల్ను నిర్వహించాయి.
ఉగ్రవాదులు ఇళ్లలోకి చొరబడితే ఎలా తిప్పికొడతారో కళ్లకు కట్టినట్లు చూపించారు ఎన్ఎస్జీ కమాండోలు. హెలికాప్టర్లో సడెన్గా వచ్చిన ఎన్ఎస్జీ కమాండర్లు.. భవనం మీద దిగారు. అక్కడి నుంచి కిందకు తాళ్ల సాయంతో దిగి.. ఉగ్రవాదులను మట్టుబెట్టారు. బాంబుల మోతతో ఆ ప్రాంతం మారు మోగింది. ఈ మాక్ డ్రిల్ ద్వారా షిరిడీ ప్రజలను అప్రమత్తం చేశారు.
అయితే ఇదంతా మాక్డ్రిల్ అని తెలియక స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. అక్కడి నుంచి భయంతో పరుగులు పెట్టారు. తీరా ఇదంతా మాక్డ్రిల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.