వికారాబాద్ జిల్లా పరిగిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రోజా ట్రేడర్స్-ఆర్డర్ సప్లయర్ పేరుతో జనాలకు కొందరు వ్యాపారులు కుచ్చుటోపి పెట్టారు. ఎలక్ట్రానిక్, ఫర్నిచర్ వస్తువుల, మొబైల్ ఫోన్లపై 40 శాతం.. డిస్కౌంట్ ఇప్పిస్తామని చెప్పి ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఇలా దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన తరువాత బోర్టు తిప్పేశారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న స్థానికులు.. షాపు ముందు నిరసనకు దిగారు.