హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. సనత్ నగర్లో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 20 రోజుల క్రితమే ఈ యువతి... తల్లిదండ్రులని ఎదిరించి.. దాసరి కార్తీక్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే.. ఇంతలోనే పూర్ణిమ శవంగా మారడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. భర్త కార్తీకే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు. న్యాయం చేయాలంటూ.. సనత్నగర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.