ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న జనసేనాని.. కొన్ని అంశాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుత పర్యటన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఉంటుందా, లేదంటే రాజకీయ పరమైన చర్చలకు ఆస్కారం ఇస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.