వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళని పట్టుకోవాలి : బీటెక్ రవి

Update: 2019-12-05 16:29 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి... విచారణకు హాజరయ్యారు.. గత నాలుగు రోజులుగా ఈకేసుతో సంబంధం ఉన్న అనుమానితుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.. స్థానిక పరిస్థితులపై తనకున్న అవగాహన విచారణకు ఉపయోగపడుతుందనే పిలిచారని బీటెక్‌ రవి తెలిపారు..అమాయకుల్ని బలి చేయకుండా.. అసలు దోషుల్ని పట్టుకొని త్వరలో కేసుని ముగించాలన్నారు.

Similar News