స్నేహం ముసుగులో బాలికను చెరబట్టాడో కీచకుడు. బర్త్డే రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంటూ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణం విజయవాడలోని భవానీపురంలో వెలుగులోకి వచ్చింది. నిందితుడికి అతని తల్లి సాయం చేసినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.