దిశ ఘటనపై యావత్ దేశం ఆమె కుటుంబానికి బాసటగా నిలిస్తే.. కామారెడ్డి జడ్పీ ఛైర్మన్ దఫేదార్ శోభ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులతో దిశకు సరైన సఖ్యత లేనట్లుగా కనిపిస్తోందన్నారు. అందుకే ఆమె తండ్రికి ఫోన్ చేయకుండా.. చెల్లికి ఫోన్ చేసిందన్నారు. తల్లిదండ్రులు ధైర్యం చెప్పే పరిస్థితి లేకపోవడం వల్లే ఆమె ఇలా చేసిందన్నారు. పిల్లలు తమ సమస్యలను చెప్పుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉండొద్దని హితవు పలికారు. ప్రభుత్వం ఎంత మందినని కాపాడుతుందంటూ వ్యాఖ్యలు చేశారు జడ్పీ ఛైర్మన్ శోభ.