టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికలోటును చూపించి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాకెట్ బుక్ తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ఎక్సైజ్ విధానంపై సోమవారం వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించాలన్నారు కోదండరామ్.