కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీఐ రామయ్య నాయుడు ఏసీబీకి దొరికారు. గోపాల్రెడ్డి అనే వ్యక్తిపై రౌడీ షీట్ తెరవకుండా ఉండేందుకు 40 వేలు డిమాండ్ చేశారు. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి ద్వారా ఆ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐ రామయ్య నాయుడు, అడ్వొకేట్ చంద్రశేఖర్రెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.