కర్నూలు జిల్లాలో టీడీపీ నేత మంజుల సుబ్బారావు దారుణహత్యకు గురయ్యారు. కొలిమిగుండ్ల మండలం బెలుంకేవ్స్ వద్ద సబ్బారావును వేటకొడవళ్లతో నరికి చంపారు ప్రత్యర్థులు. మంజుల సుబ్బారావుది కొలిమిగుండ్ల మండలం చింతలయపల్లె గ్రామం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యపై దర్యాప్తు చేపట్టారు. రాజకీయ కక్షలే హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.