విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడో రౌడీషీటర్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గవర్నర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు చిన్నరాజా అనే రౌడీషీటర్. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై మాచవరం పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది.