రాజధాని రైతుల నిరసనకు జనసేన సంఘీభావం

Update: 2019-12-20 08:00 GMT

రాజధాని రైతుల నిరనసకు జనసేన సంఘీభావం ప్రకటించింది. మందడం వెళ్లిన జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు ధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతులతో కలిసి రోడ్డుపైనే కూర్చుని ధర్నా చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సైతం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు నాదెండ్ల మనోహర్‌.

రాజధాని రైతులకు జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు ఆ పార్టీ నేత నాగబాబు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజధానికి మద్దతిచ్చారని.. కానీ ఇప్పుడా ఆ మాట నుంచి తప్పుకుంటున్నారని విమర్శించారు. రైతులు, మహిళలకు అన్యాయం చేయోద్దని ప్రభుత్వాన్ని కోరారాయన.

Similar News