పౌరసత్వ సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. పౌరసత్వ బిల్లు ఏ మతం, ప్రాంతం, వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంవైపు తీసుకెళ్తున్న ప్రధాని మోదీపై కొన్ని విదేశీ, రాజకీయ శక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మతం పేరుతో ప్రజలను విభజించే రాజకీయ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కిషన్రెడ్డి.