విశాఖ రైతు బజారులో ప్రజలు ఉల్లి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కయపాలెంలోని నర్సింహారావు రైతు బజార్ని సందర్శించిన ఆయన.. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి కొనేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇప్పటికే ఈ సమస్యపై జిల్లా కలెక్టర్తో మాట్లాడనన్నారు.