మూడుముక్కలాటలో రాయలసీమ ఓడిపోయింది: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Update: 2019-12-26 12:27 GMT

రాష్ట్రంలో జరిగిన మూడుముక్కలాటలో రాయలసీమ మళ్లీ ఓడిపోయిందని.. బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి.. తలను విశాఖలో మొండాన్ని అమరావతిలో.. తోకకు ఉన్న వెంట్రుకలను మాత్రం రాయలసీమలో పడేశారంటూ ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అనేది అబద్ధమని.. అసలు రాజధాని విశాఖనే అన్నారు. ఈ విషయంలో విశాఖ గెలిచి.. రాయలసీమ ఓడిపోయిందని బైరెడ్డి విమర్శించారు.

Similar News