ఫిలిప్పీన్స్లో తుపాను తీవ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఫాన్ఫోన్ తుపాను, జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఫాన్ఫోన్ విలయంతో 16 మంది మరణించారు. పదుల మంది గల్లంత య్యారు. సైక్లోన్ ఎఫెక్ట్తో చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని అధికారులు సూచించారు.