కాంగ్రెస్ నేతృత్వంలోనే సెక్యులరిజం బలపడుతుందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. మతతత్వ బీజేపీకి మొదట్నుంచి సీఎం కేసీఆర్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, ఎన్సారీ తదితర అంశాల్లో బీజేపీకి సీఎం కేసీఆర్ సంపూర్ణంగా మద్దతిచ్చారన్నారు. కాంగ్రెస్ మాత్రమే లౌకికవాదానికి కట్టుబడి ఉందన్నారాయన.