తెలంగాణ సీఎంగా కేసీఆర్ తర్వాత.. ఎవరూ అనే చర్చ సహజంగా జరుగుతూనే ఉంటుంది. దీనిపై పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత.. కేటీఆరే సీఎం అనే విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసు అన్నారు. తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ సందర్భంగా.. రిపోర్టర్లతో చిట్చాట్ చేస్తూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కేసీఆర్ వైపు, యువత కేటీఆర్ వైపు చూస్తోందన్నారు. కేసీఆర్ తర్వాత.. ప్రజాదరణ ఉన్న నేత కేటీఆర్ అన్నారాయన. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అవడం సహజమన్నారు శ్రీనివాస్గౌడ్.