ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో చివరకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాననే అపవాదు తనమీద పడుతుందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఏ కమిటీ నివేదికలైనా ఆ ప్రభుత్వాల హయాంలో పాలకులకు అనుకూలంగానే ఉంటాయన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అసెంబ్లీలు, సచివాలయాలు, హైకోర్టు బెంచ్లు ఏర్పాటై అభివృద్ధి సమాంతరంగా ఉంటేనే ఏ గొడవలూ ఉండవన్నారు టీజీ వెంకటేష్.