పార్టీ మారే ఆలోచన నాకు లేదు - గంటా

Update: 2019-12-31 07:04 GMT

పార్టీ మారే ఆలోచన తనకు లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. అమరావతి రైతులకు అండగా నిలవాలన్న అధినేత చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటా అన్నారు. అదే టైంలో విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ను స్థానికుడిగా స్వాగతిస్తానని చెప్పారు. విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయని ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయని.. వాటిని తొలగించాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందన్నారు గంటా.

 

Similar News