అమరావతి రైతుల పోరాటానికి తమ కుటుంబం అండగా ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబుతో కలిసి ఆమె అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తొలుత ఎర్రబాలెం సభలో భువనేశ్వరి మాట్లాడారు. అమరావతికి భూములిచ్చిన రైతులను చంద్రబాబు కలలో కూడా మరిచిపోరని అన్నారామె. రాజధాని మహిళల కష్టాన్ని తోటి మహిళగా తాను అర్థం చేసుకోలగను అన్నారు.